యాప్నగరం

ఏడాది పాటు కరోనా కష్టాలు! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

coronavirus crisis: ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి తాము బయోసెన్సార్‌ వ్యవస్థను డెవలప్‌ చేస్తున్నట్లు నిమ్స్‌ రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతి మధుమోహన్‌రావు ప్రకటించారు. కరోనా పాజిటివ్‌ చికిత్స కోసం పరిశోధనలు ముమ్మరం చేశామని చెప్పారు.

Samayam Telugu 22 Apr 2020, 9:29 pm
కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఎప్పుడు ప్రపంచాన్ని వదిలి పోతుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కొందరు నిపుణులు మాత్రం క‌రోనా వైర‌స్ ఇప్పుడ‌ప్పుడే మ‌న‌ల్ని వ‌దిలేలా లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావం అంత తేలిగ్గా పోదని, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు 2022 వరకూ అవలంబించాల్సి రావచ్చని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సైతం అంచనా వేశారు.
Samayam Telugu corona cases in hyd.


అయితే, కరోనా నియంత్రణకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని నిమ్స్‌ రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతి మధుమోహన్‌రావు వెల్లడించారు. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి తాము బయోసెన్సార్‌ వ్యవస్థను డెవలప్‌ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కరోనా పాజిటివ్‌ చికిత్స కోసం పరిశోధనలు ముమ్మరం చేశామని చెప్పారు. ఆవు పాలు, మేక పాల ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయని మధుమోహన్‌రావు తెలిపారు. కరోనాపై పరీక్షలు చేయడం, చికిత్సలో కొత్త విధానం తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంద‌ని మధుమోహన్‌రావు స్పష్టం చేశారు.

మరోవైపు, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 943కు చేరుకున్నాయి. బుధవారం కొత్తగా మరో 15 కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో మరో వ్యక్తి మరణించగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 24కు చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 10 కరోనా కేసులు, సూర్యాపేటలో మరో 3 కేసులు, గద్వాలలో రెండు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటివరకు 194 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ వెలువరించింది. ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అందులో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.