యాప్నగరం

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్

TRS సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కరోనా బారిన పడ్డారు. ఆయన గన్‌మెన్, పీఏకు కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

Samayam Telugu 22 Jul 2020, 8:53 am
పాత వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన కొడుకు, కోడలు కూడా కోవిడ్ బారిన పడ్డారు. వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావు దంపతులకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో వారు చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu కడియం శ్రీహరి
kadiyam srihari coronavirus


తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. కడియంతోపాటు ఆయన గన్‌మెన్, పీఏకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

తెలంగాణలో ఇప్పటి వరకూ చాలా మంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కరోనాను జయించారు. హోం మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, బిగాల గణేష్, భాస్కర్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు కోవిడ్ బారిన పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.