యాప్నగరం

జనశక్తి మాజీ నేత చంద్రన్న కన్నుమూత.. నాడు చర్చల్లో కీలక పాత్ర

Chandranna: జనశక్తి మాజీ నేత చంద్రన్న మృతి చెందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

Samayam Telugu 13 Dec 2019, 2:35 pm
నశక్తి మాజీ నేత కె.చంద్రన్న (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం (డిసెంబర్ 13) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో జనశక్తి పక్షాన ప్రతినిధిగా పాల్గొన్న చంద్రన్న కీలక పాత్ర పోషించారు. కొంత కాలంగా ఆయన మధుమేహం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల విద్యానగర్‌లోని ఆంధ్ర మహాసభ ఆస్పతిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు.
Samayam Telugu chandranna


యాదాద్రి జిల్లా టంగుటూర్‌ గ్రామానికి చెందిన చంద్రన్న మొదట్లో ఈసీఐఎల్‌ ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేసే సమయంలోనే ఆయనకు విప్లవ కార్మిక సంఘాలతో పరిచయం ఏర్పడింది. భారత కార్మిక సంఘాల సమాఖ్య, జనశక్తి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. బీడీ, సింగరేణి కార్మికులకు సంబంధించిన అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. చంద్రన్న మృతి పట్ల న్యూడెమోక్రసీ సంతాపం ప్రకటించింది.

Also Read: ఫ్లైఓవర్ ప్రమాదం: కృష్ణమిలాన్ రావు అరెస్ట్‌పై జనవరి 3వరకు స్టే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.