మాజీ మంత్రి, పీవీ సన్నిహితుడు మాదాడి నరసింహారెడ్డి కన్నుమూత
మాజీ మంత్రి, మాజీ ప్రధాని పీవీకి అత్యంత సన్నిహితుడైన మాదాడి నరసింహారెడ్డి మరణించారు. వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లాకు చెందిన మాాదాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పని చేశారు.
Samayam Telugu 10 Oct 2019, 1:24 pm
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మాదాడి నరసింహారెడ్డి (85) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గురువారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు మంత్రిగా వ్యవహరరించిన మాదాడి.. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితులు. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన.. శాయంపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేశారు.
నరసింహారెడ్డి ఇప్పటి భూపాలపల్లి జిల్లా మొసలపల్లిలో జన్మించారు. ఒకప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయన చక్రం తిప్పారు. వయోభారం కారణంగా ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన శాయంపేట నియోజకవర్గం 2004లో భూపాలపల్లిగా మారింది.
నరసింహారెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా మాదాటి చేసిన సేవలను ఆయన కొనియాడారు. మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
నరసింహారెడ్డి ఇప్పటి భూపాలపల్లి జిల్లా మొసలపల్లిలో జన్మించారు. ఒకప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయన చక్రం తిప్పారు. వయోభారం కారణంగా ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన శాయంపేట నియోజకవర్గం 2004లో భూపాలపల్లిగా మారింది.
నరసింహారెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా మాదాటి చేసిన సేవలను ఆయన కొనియాడారు. మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.