యాప్నగరం

నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమం

కరోనా నుంచి కోలుకున్నాక నాయిని ఇంటకి వెళ్లారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 17 Oct 2020, 7:29 am
టీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. న్యుమోనియా కారణంగా ప్రస్తుతం నాయిని జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 28 వ తేదిన కరోనా బారిన పడిన నాయిని.. అక్కడ చికిత్స తీసుకోగా పది రోజుల తర్వాత కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయనకి ఉపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు పరీక్షలు చేశారు. ప్రస్తుతం నాయిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు.
Samayam Telugu నాయిని ఆరోగ్యం విషయం
naini narasimha reddy health critical


అయితే ఈ పరీక్షలలో ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని వైద్యులు గుర్తించారు. దీనితో అయన ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. ఈ క్రమంలో అయనని మంగళవారం హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే అక్కడ ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ మేరుగైన చికిత్స కోసం అక్కడే ఉన్నారు.

Read More: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్షాలు

ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా సోకింది. మంత్రులు హరీష్ రావు,మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు కరోన బారిన పడ కోలుకున్న విషయం తెలిసిందే. నాయిని ఆరోగ్యంపై టీఆర్ఎస్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. అలాగే నాయిని అల్లుడు, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.