యాప్నగరం

తెలంగాణలో ఘోరం.. నలుగురు చిన్నారులు దుర్మరణం..

తెలంగాణలో ఈత సరదా నలుగురి ప్రాణాలను తీసింది. నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు.

Samayam Telugu 4 Jul 2020, 9:16 pm
రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లాలో శనివారం ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. శనిగాపురం బోధ్‌ తండాకు చెందిన నలుగురు చిన్నారులు శనివారం సాయంత్రం తుమ్మల చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు.
Samayam Telugu నలుగురు చిన్నారులు దుర్మరణం


అయితే ప్రమాదవశాత్తూ వీరంతా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.

మృతి చెందిన చిన్నారులను ఇస్లావత్ లోకేష్ (10), ఇస్లావత్ ఆకాష్ (12), బొడా దినేష్ (10), బొడా జగన్ (14)గా గుర్తించారు. ఒకేసారి నలుగురు చిన్నారులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.