యాప్నగరం

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Nizamabad District: నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించేలోపే ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. ఇందల్వాయి మండలంలోని 44వ నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగింది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 13 Mar 2023, 8:13 am

ప్రధానాంశాలు:

  • నిజామాబాాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
  • అతి వేగమే ప్రమాదానికి కారణమని అనుమానాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu accident
ప్రమాదం
Nizamabad District: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. భారీ ట్రక్కును అతివేగంతో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను మహారాష్ట్రలోని బిలోలికి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. ప్రమాదం విషయంపై మృతుల కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. కుటుంసభ్యులకు మృతదేహాలను అందించనున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎలా జరిగింది? అనే వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నారు.

అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలను తెలసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.