యాప్నగరం

కరీంనగర్‌లో మరో 4 కరోనా కేసులు.. మళ్లీ కలవరం

Karimnagar నగరంలో మరో నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో కేసుల సంఖ్య 17కు చేరుకోగా.. రాష్ట్రంలో కేసుల సంఖ్య 158కు చేరుకుంది.

Samayam Telugu 3 Apr 2020, 11:33 am
రీంనగర్‌ నగరాన్ని కరోనా మహమ్మారి కలవరానికి గురి చేస్తోంది. నగరంలో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) సుజాత శుక్రవారం (ఏప్రిల్ 3) ఉదయం ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిలో ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ముగ్గురు ఉండగా.. ఇండోనేసియా బృందంతో సన్నిహితంగా తిరిగిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆమె తెలిపారు. వీరందరినీ హైదరాబాద్ తరలించినట్లు వెల్లడించారు.
Samayam Telugu karimnagar


కరోనా సోకిన బాధితులను సికింద్రాబాద్‌‌లోని గాంధీ ఆస్పత్రికి, కింగ్‌ కోఠి ఆసుపత్రులకు తరలించినట్లు డీఎంహెచ్‌వో సుజాత తెలిపారు. కరీంనగర్‌ నుంచి నిజాముద్దీన్‌లోని మత ప్రార్థనలకు మొత్తం 19 మంది వెళ్లొచ్చినట్లు గుర్తించారు. వారిలో 11 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మరి కొందరి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు.

Also Read: సారీ చెప్పిన వనపర్తి ఎస్పీ.. కేటీఆర్ ట్వీట్‌కు స్పందన

కరీంనగర్‌లో ఇప్పటి వరకు 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీరిలో 10 మంది ఇండోనేసియా వాసులే కావడం గమనార్హం. ఇండోనేసియా బృందంలోని వారందరూ కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వీరి కారణంగా స్థానికంగా మరికొంత మందికి కరోనా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాన్ని దిగ్బంధం చేసి 100 వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహించారు. అనుమానితులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఎప్పటికప్పుడు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు.

మరోవైపు.. రాష్ట్రంలో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. కట్టుదిట్టమైన చర్యల నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న తరుణంలో ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 29 జిల్లాల నుంచి మొత్తం 1030 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వీరిలో 80 శాతం మందిని గుర్తించి నమూనాలను పరీక్షించగా.. పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Must Read: నిర్మల్‌లో కరోనా రోగి అంత్యక్రియలు పూర్తి.. నిబంధనల ప్రకారమే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.