యాప్నగరం

పుణ్యస్నానాలకు వెళ్లి గోదావరిలో నలుగురు మృతి

Godavari: పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరి నదిలో ఏకాదశి స్నానానికి వెళ్లిన కార్తీక్, రవీందర్, ప్రదీప్ అనే ముగ్గురు యువకులు స్నానాలు చేస్తూ అందులో మునిగిపోయారు.

Samayam Telugu 1 Jul 2020, 2:53 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఏకాదశిని పురస్కరించుకుని గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లిన యువకుల్లో కొందరు ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు. రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు యువకులు మృతి చెందారు. పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరి నదిలో ఏకాదశి స్నానానికి వెళ్లిన కార్తీక్, రవీందర్, ప్రదీప్ అనే ముగ్గురు యువకులు స్నానాలు చేస్తూ అందులో మునిగిపోయారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Dead hand


మరోవైపు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని పోతవాడకు చెందిన తుంగల శ్రీశైలం (20) అనే యువకుడు కూడా ఏకాదశి సందర్భంగా పుణ్య స్నానాల కోసం గోదావరి నది వద్దకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా అదుపు కోల్పోయి నీటిలో మునిగిపోయాడు. సాయం కోసం అర్థించినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వీలు కాలేదని స్థానికులు చెప్పారు. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.