యాప్నగరం

ఎస్సై భూ సెటిల్మెంట్ల దందా!.. వీడియో వైరల్

Gadwal: ఎస్సై శ్రీనివాస్ వివాదాల్లో ఉన్న భూములను తన బంధువుల పేరిట అగ్రిమెంట్ చేయించుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సెటిల్మెంట్లు చేస్తూ ముడుపులు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Samayam Telugu 20 Feb 2020, 3:24 pm
జోగులాంబ గద్వాల జిల్లాలో ఎస్సై సెటిల్మెంట్లకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భూతగాదం విషయంలో సెటిల్మెంట్ చేస్తున్న వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఎస్సై శ్రీనివాస్ వివాదాల్లో ఉన్న భూములను తన బంధువుల పేరిట అగ్రిమెంట్ చేయించుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సెటిల్మెంట్లు చేస్తూ బాగా ముడుపులు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి.
Samayam Telugu 1566149001-1608


మీరే పెద్ద మనిషి అని బాధితులు ఎస్సైని వేడుకుంటుండడం వీడియోలో రికార్డయింది. మరోవైపు, మెదక్ రూరల్ ఎస్సై ఆంజనేయులు కూడా అక్రమాలకు పాల్పడి సస్పెండయ్యారు. గత కొద్దిరోజులుగా అక్రమ ఇసుక రవాణాకు తోడ్పడుతూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎస్సై ఆంజనేయులును జిల్లా ఎస్పీ చందన దీప్తి సస్పెండ్ చేశారు.

Also Read: ఆధార్ నోటీసులు: సంచలన విషయాలు వెలుగులోకి .. అతనే అసలు సూత్రధారి

Must Read: హీరోయిన్ రష్మిక ఫోటోపై జగిత్యాల కలెక్టర్ కామెంట్.. పోలీసులకు ఫిర్యాదు

Must Read: కలెక్టర్ల కన్నా ఎక్కువ జీతాలు.. అయినా పని చేయరా? నిలదీసిన మంత్రి హరీశ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.