యాప్నగరం

ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం: మంత్రి తలసాని

Ganapati Navratri celebrations: గణపతి నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఆగస్టు 31 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని వెల్లడించారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 17 Aug 2022, 3:09 pm

ప్రధానాంశాలు:

  • ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు
  • సెప్టెంబరు 9న గణేష్‌ నిమజ్జనం
  • గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తలసాని సమీక్ష
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Minister Talasani Srinivas Yadav Review
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష
Ganapati Navratri celebrations: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని.. వచ్చే నెల 9న గణేష్‌ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో తలసాని మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ (GHMC) ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున.. మొత్తం 6 లక్షల గణేష్‌ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని వివరించారు.
ఖైరతాబాద్‌ గణేష్‌ (Khairatabad Ganesh)ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా.. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్‌ గణేష్‌ మండపాన్ని సందర్శిస్తానని చెప్పారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్‌లకు అదనంగా.. మరో 50 పాండ్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

గణపతి విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) వెల్లడించారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. మూడు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్‌ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని మంత్రి తలసాని ప్రజలను కోరారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.