యాప్నగరం

ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

GHMC: బుధవారం హైదరాబాద్‌లో పడ్డ కుండపోత వర్షానికి రోడ్లన్నీ మోకాలు లోతు చెరువులుగా మారిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల రోడ్లపై నడుములోతున వరద నీరు చేరింది. కొద్ది గంటలు పడ్డ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది.

Samayam Telugu 17 Sep 2020, 7:18 pm
గురువారం రాత్రివేళ దాదాపు మూడు నాలుగు గంటల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌ కుమార్ వెల్లడించారు. వర్షం పడే సమయంలో, ఆ తర్వాత కూడా ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. నగరంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్), మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే జీహెచ్ఎంసీ టోల్‌ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-29555500 సంప్రదించాలని లోకేష్‌ కుమార్ చెప్పారు.
Samayam Telugu జీహెచ్ఎంసీ కమిషనర్ (ఫైల్ ఫోటో)
ghmc commisioner


బుధవారం హైదరాబాద్‌లో పడ్డ కుండపోత వర్షానికి రోడ్లన్నీ మోకాలు లోతు చెరువులుగా మారిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల రోడ్లపై నడుములోతున వరద నీరు చేరింది. కొద్ది గంటలు పడ్డ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. బుధవారం పగలంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయి రెండు గంటల్లోనే 10 సెంటీ మీటర్లకు పైగా వాన పడింది. గురువారం కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఉదయం బాగా ఎండ కాయగా.. సాయంత్రానికి మబ్బులు పట్టి కుండపోత కురుస్తోంది.

దీంతో ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వరద నీటి తాకిడికి పార్క్ చేసిన బైక్‌లు కొట్టుకుపోతున్నాయి. పురాతన భవనాల గోడలు కూలాయి.

Also Read: 139 మంది రేప్ కేసు బాధితురాలితో ఇంటర్వ్యూ.. తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదుMust Read: కేసీఆర్ చెప్పింది నిజమైతే ఉరేసుకుంటా.. లేదంటే నువ్వు వేసుకుంటావా: ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.