యాప్నగరం

Ghmc Polling: గ్రేటర్‌లో ముగిసిన ఓటింగ్.. దారుణంగా తగ్గిన పోలింగ్ శాతం

మరో మూడు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అయితే ఈ సారి గతంలో ఎన్నడూ లేనతంగా ఓటింగ్ శాతం తగ్గింది. భాగ్యనగర ప్రజలు ఎవరూ ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు.

Samayam Telugu 1 Dec 2020, 6:32 pm
గ్రేటర్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరాబాద్‌లో ఎన్నడూ లేనంతంగా పోలింగ్ శాతం దారుణంగా తగ్గింది. సాయంత్రం నాలుగు గంటల వరకు కేవలం 30శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయ్యింది. అరగంట వరకు క్యూ లైన్‌లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. ఈనెల నాల్గవ తేదీన గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మరోవైపు ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్‌ను అధికారులు రద్దు చేశారు.
Samayam Telugu ముగిసిన పోలింగ్
ghmc polling


కొన్నిప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా చెదురు ముదుురు ఘటనలు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు వాగ్వాదాలు, ఘర్షణలకు దిగారు. అయితే నగర శివారుల్లోనే ఎక్కువగా ఓటింగ్ నమోదు అయ్యింది. బస్తీల్లో కాలనీలో ప్రజలు వచ్చి ఓటు వేశారు. కానీ యువత మాత్రం పెద్దగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటంతో అంతా సొంతూళ్లకు వెళ్లారు. మరోవైపు వరుసగా నాలుగురోజులు సెలవులు కూడ రావడంతో గ్రేటర ప్రజలు కూడా చాలామంది బయట ప్రాంతాలకు,విహార యాత్రలకు వెళ్లిపోయారు.

Read More: GHMC Election Polling Updates:మంత్రి కారుపై దాడి, అద్దాలు ధ్వంసం.. ఒకర్ని తీవ్రంగా కొట్టి..

దీంతో మధ్యాహ్నం తర్వాత అయినా ఓటింగ్ శాతం పెరుగుతుందని అధికాారులు భావించారు. కానీ ఎక్కడా కూడా యువత ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. కొంతవరకు కరోనా వైరస్ భయం కూడా ప్రజల్లో నెలకొని ఉందని.. అందుకే పోలింగ్ శాతం తగ్గిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కానీ పోలింగ్ శాతం తగ్గడానికి చాలావరకు కారణాలు కనిపిస్తున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా అలసత్వం వహించి ఓటు వేయలేదని కూడా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.