యాప్నగరం

రోడ్డుపై వ్యర్థాలు వేసిన వ్యక్తికి రూ.లక్ష ఫైన్.. షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ

Hyderabad: రోడ్డుపై వ్యర్థాలు వేసిన ఇద్దరు వ్యక్తులకు జీహెచ్‌ఎంసీ భారీ జరిమానాతో షాకిచ్చింది. ఒక్కొక్కరిపై లక్ష రూపాయల ఫైన్ విధించింది. మియాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 9 Oct 2019, 10:23 pm
రోడ్డుపై వ్యర్థాలు వేసిన వారిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కఠిన చర్యలు తీసుకుంది. బుధవారం (అక్టోబర్ 9) మియాపూర్ ప్రధాన రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలను వేసిన విషయాన్ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనపై ఆరా తీశారు. బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. రోడ్డుపై వ్యర్థాలు వేసి, ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన వారిపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు.
Samayam Telugu fine


Also Read: హైదరాబాద్ వర్షం.. పిడుగులు పడే ప్రమాదం, బయటకు రావొద్దు

నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. భవన నిర్మాణ వ్యర్థాలు తరలించడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసిందని.. సమాచారం ఇచ్చి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.