యాప్నగరం

పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి జరిమానా విధించిన అధికారులు

హైదరాబాద్ వీఎస్టీ వద్ద పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీపై ఓ వ్యక్తి సెంట్రల్ ఎన్‌పోర్స్ మెంట్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

Samayam Telugu 3 Sep 2020, 6:42 am
జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ బుధవారం జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఓ అభిమానికి జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. జరిమానా విధించింది. వీఎస్టీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటోను ఓ నెటిజన్‌ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నరేందర్‌కుమార్‌ అనే వ్యక్తికి రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు పంపారు.
Samayam Telugu ghmc fines to pawan kalyan birthday flexi in vs hyderabad
పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి జరిమానా విధించిన అధికారులు


మరోవైపు చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ ముగ్గురు పవన్ అభిమానులు విద్యుత్ షాక్ తగిలి మరణించిన విషయం తెలిసిందే. శాంతిపురంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ఏడోమైలు వద్ద ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం జరిగింది, ఈ ఘటనపై పవన్ కళ్యాణ్‌తో పాటు చిరంజీవి, రామ్ చరణ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.