యాప్నగరం

బంజారహిల్స్‌లో జీహెచ్ఎంసీ కార్మికురాలు ఆత్మహత్య

జీహెచ్ఎంసీ కార్మికురాలుగా పనిచేస్తున్న భర్త చనిపోవడంతో కొడుకుతో కలిసి నివసిస్తుంది. కొడుకు ఏదో పనిమీద బయటకు వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది.

Samayam Telugu 19 Sep 2020, 8:30 am
మానసిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. అప్పులా బాధతో కొందరు, కుటుంబసమస్యలతో మరికొందరు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు . ఆ బాధను తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాాజాగా హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌-7 దేవరకొండబస్తీకి చెందిన రేణుక (40)జీహెచ్‌ ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది.
Samayam Telugu జీహెచ్ఎంసీ కార్మికురాలు ఆత్మహత్య
ghmc woker suicide


భర్త చనిపోగా రేణుక కుమారుడు గణే్‌షతో కలిసి నివసిస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గురువారం గణేశ్‌ పనిపై బయటకెళ్లి అర్ధరాత్రి తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఎంత కొట్టినా అతడి తల్లి తలుపులు తీయలేదు. పక్కనే ఉన్న కిటికి నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సహాయంతో తలుపులు బద్ధలుకొట్టి ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మరణించింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.