యాప్నగరం

హైదరాబాద్‌లో విషాద ఘటన.. ఆడుకుంటూనే అనంతలోకాలకు..

రోడ్డు ప్రమాదంలో చిన్నారి చనిపోయిన సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. ఆడుకుంటున్న చిన్నారిని లారీ ఢీకొట్టడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

Samayam Telugu 15 Nov 2019, 10:01 pm
హైదరాబాద్ నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి ఆడుకుంటూనే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ప్రమాదవశాత్తూ డీసీఎం ఢీకొట్టడంతో నెత్తుటి మడుగులో పడిన చిన్నారి స్థానికుల హృదయాలను కలచివేసింది. పాపను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమవడంతో ఆస్పత్రిలో ఆ చిన్నారి కన్నుమూసింది. అత్యంత విషాదకర సంఘటన జూబ్లీహిల్స్‌లో జరిగింది.
Samayam Telugu accident


డీసీఎం లారీ ఢీకొట్టి చిన్నారి మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 41లో రోడ్డు పక్కన ఆడుకుంటున్న ఒక చిన్నారిని డీసీఎం ఢీకొట్టడంతో తీవ్రగాయాలై తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే స్థానికులు ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని 108 వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Also Read: పవన్ కళ్యాణ్‌.. ఆ కిక్కే వేరబ్బా! వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.