యాప్నగరం

పట్టణ ప్రగతి కార్యక్రమంలో అపశ్రుతి.. చిన్నారి మృతి

Pattana Pragathi: మరో ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడ్ని చికిత్స నిమిత్తం నగరంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Samayam Telugu 1 Mar 2020, 1:53 pm
వరంగల్ అర్బన్ జిల్లాలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా నగరంలోని 43వ డివిజన్ కాకతీయ యూనివర్సిటీ రోడ్డులో మురుగు కాలువ పనులు చేపడుతున్నారు. గోడ పక్కన పొక్లెయినర్‌తో కాల్వను తవ్వుతుండగా, అది తగిలి పక్కనే ఉన్న గోడ కూలింది. ఆ సమయంలో గోడ మరో పక్కనే ఆడుకుంటున్న చిన్నారులపై ఆ శిథిలాలు పడ్డాయి. ఈ ఘటనలో ఐదేళ్ల పాప అక్కడికక్కడే మృతి చెందింది.
Samayam Telugu Warangal Urban


Also Read: ‘రేవంత్ తప్పు చేశారు.. వారికి క్షమాపణలు చెప్పాలి’

మరో ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడ్ని చికిత్స నిమిత్తం నగరంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని తెలిపారు.

Must Read: కలర్ ఫుల్‌గా మారుతున్న హైదరాబాద్.. కారణమదేనా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.