యాప్నగరం

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam: నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంత వాసులను అధికారులు ముందస్తుగానే అప్రమత్తం చేశారు.

Samayam Telugu 16 Aug 2020, 10:39 am
భద్రాచలం పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం గోదారిలో నీటిమట్టం 48.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమలులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద నీరు పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తుందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
godavari river water level


ఈ వరద నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంత వాసులను అధికారులు ముందస్తుగానే అప్రమత్తం చేశారు. బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రతి ప్రతి ప్రభావిత గ్రామంలోనూ చాటింపు వేశారు. మరోవైపు, భద్రాచలం ఆలయ పడమర మెట్ల వైపు వర్షపు నీరు చేరింది. ఆదివారం ఉదయం ఈ మార్గంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతోపాటు అన్నదాన సత్రం వద్ద మురుగునీరు భారీగా వచ్చి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.