యాప్నగరం

Bhadradri: 10 రోజుల్లో 50 వేల బుకింగ్‌లు.. రాములోరి తలంబ్రాలకు ఫుల్ డిమాండ్, బుకింగ్ ఇలా..!

Bhadradri Sita Ramachandraswamy: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం ద్వారా భక్తులకు ఇంటి వద్దకే తలంబ్రాలు అందిచనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో... కేవలం 10 రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు వచ్చాయి.

Authored byసందీప్ పూల | Samayam Telugu 29 Mar 2023, 1:06 pm

ప్రధానాంశాలు:

  • భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన
  • పది రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు
  • రూ.116 చెల్లిస్తే ఇంటి వద్దకే తలంబ్రాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bhadradri Temple
భద్రాద్రి టెంపుల్
Bhadradri Temple: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం ఈనెల 30న జరగనుంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తులు పొందేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రూ.116 చెల్లించి బుక్‌ (Online Booking) చేసుకుంటే కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన లభించింది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

టీఎస్‌ఆర్టీసీ భక్తులకు మరో అవకాశాన్ని కల్పించింది. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించింది. కార్గో పార్శిల్‌ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే.. నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు.. TSRTC లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 9154680020, 7382924900ను సంప్రదించాలన్నారు. సంస్థకు చెందిన మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్లు స్వీకరిస్తారని తెలిపారు.


శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) శుభవార్త వినిపించారు. ఈనెల 30న భధ్రాచలంలో జరుగనున్న రాములోరి కళ్యాణ మహోత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు భద్రాద్రి రాములోరి కళ్యాణం వీక్షించడానికి లక్ష మందిపైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా రెండు లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. 80 కౌంటర్ల ద్వారా తలంబ్రాలు, లడ్డు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. గతంలో బూజు పట్టిన లడ్డు ప్రసాదాలను భక్తులకు విక్రయించటం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా నాణ్యతతో కూడిన లడ్దు ప్రసాదాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.