Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతిలా బ్రతకాలి.. శంభాజీలా చనిపోవాలన్నదే తన కల అని వ్యాఖ్యానించారు. ప్రజాదరణ ఉన్నంతవరకే మనం రాజకీయాల్లో ఉంటామని, ఈ రాజకీయాలు టార్చర్ అనిపిస్తున్నాయని తెలిపారు. మెదక్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. తానే కాదని, నేతలు ఎవరైనా సరే ప్రజాదరణ ఉంటేనే రాజకీయాల్లో ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా రాజకీయాలు టార్చర్ అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. చంపేస్తామంటూ రాజాసింగ్కు ఇటీవల పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఫోన్ నెంబర్లతో సహా డీజీపీకి రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. ఒక వాట్సప్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి రోజూ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయని, ప్రతీరోజు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రాజాసింగ్కు గతంలో అనేకసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కుటుంబసభ్యులను కూడా చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశారు. దీంతో గతంలో పలుమార్లు డీజీపీకి రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. తనను బెదిరింపులకు గురిచేసే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి ట్విట్టర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, డీజీపీకి ట్యాగ్ చేస్తూ రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో రాజాసింగ్ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. అయినా రాజాసింగ్ బీజేపీతోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ చేస్తానంటూ చెప్పుకొస్తున్నారు.
రాజాసింగ్కు గతంలో అనేకసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కుటుంబసభ్యులను కూడా చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశారు. దీంతో గతంలో పలుమార్లు డీజీపీకి రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. తనను బెదిరింపులకు గురిచేసే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి ట్విట్టర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, డీజీపీకి ట్యాగ్ చేస్తూ రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో రాజాసింగ్ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. అయినా రాజాసింగ్ బీజేపీతోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ చేస్తానంటూ చెప్పుకొస్తున్నారు.