యాప్నగరం

తెలంగాణలో 5 ప్రైవేటు యూనివర్సిటీలు.. గవర్నర్ ఆమోదం

Tamilisai Soundararajan: ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ కావడంతో.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో మహింద్రా యూనివర్సిటీ, మెదక్‌ జిల్లా సదాశివ పేట మండలం కంకోల్‌లో వోక్సెన్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి.

Samayam Telugu 20 May 2020, 11:47 pm
తెలంగాణలో 5 కొత్త యూనివర్సిటీలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ కావడంతో.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో మహింద్రా యూనివర్సిటీ, మెదక్‌ జిల్లా సదాశివ పేట మండలం కంకోల్‌లో వోక్సెన్‌ యూనివర్సిటీ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దూళపల్లి ఏరియా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో అనురాగ్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.