తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజూ వేయికి పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టిసారించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను రాజ్ భవన్కు రావాల్సిందిగా ఆదేశించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ మీటింగ్ను షెడ్యూల్ చేయగా.. ఈ సమావేశానికి హాజరుకావడం వీలు పడదని సీఎస్ కబురు పంపారు. ముందే తనకు షెడ్యూల్ అయిన కార్యక్రమాల వల్ల సమావేశానికి రాలేమని చెప్పారు.
దీంతో కరోనా తీరుపై ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. కరోనా విషయంలో ప్రభుత్వం తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో పరిస్థితిని సమీక్షంచనున్నట్లు ఈ మేరకు గవర్నర్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. కొవిడ్ ఐసోలేషన్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులతో ఈ సమీక్ష నిర్వహిస్తారు. కొవిడ్ చికిత్స, పడకలు, బిల్లులు, పరీక్షలు, ప్రజల సమస్యలపై గవర్నర్ చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు, రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండు రోజుల పాటు 1,800 పైచిలుకు పాజిటివ్ కేసులు రాగా.. ఆదివారం 1,590 కేసులు వచ్చాయి. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా హైదరాబాద్లో 1,277 మంది వైరస్ బారినపడ్డారు. తాజా కరోనా కేసులతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 23,902కు చేరింది. దీంతో దేశంలో కొవిడ్ కేసుల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానానికి చేరినట్లయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 1,15,835 కరోనా టెస్ట్లు చేశారు. అందులో 91,933 నెగెటివ్ వచ్చాయి. 23,902 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 10,904గా ఉన్నాయి. (ఆదివారం నాటి హెల్త్ బులెటిన్ ప్రకారం)
Also Read: undefined
Must Read: కరోనా రోగి మరో వీడియో వైరల్.. ఏకంగా మంత్రి ఈటలకు ఫోన్ చేసి..
దీంతో కరోనా తీరుపై ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. కరోనా విషయంలో ప్రభుత్వం తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో పరిస్థితిని సమీక్షంచనున్నట్లు ఈ మేరకు గవర్నర్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. కొవిడ్ ఐసోలేషన్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులతో ఈ సమీక్ష నిర్వహిస్తారు. కొవిడ్ చికిత్స, పడకలు, బిల్లులు, పరీక్షలు, ప్రజల సమస్యలపై గవర్నర్ చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు, రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండు రోజుల పాటు 1,800 పైచిలుకు పాజిటివ్ కేసులు రాగా.. ఆదివారం 1,590 కేసులు వచ్చాయి. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా హైదరాబాద్లో 1,277 మంది వైరస్ బారినపడ్డారు. తాజా కరోనా కేసులతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 23,902కు చేరింది. దీంతో దేశంలో కొవిడ్ కేసుల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానానికి చేరినట్లయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 1,15,835 కరోనా టెస్ట్లు చేశారు. అందులో 91,933 నెగెటివ్ వచ్చాయి. 23,902 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 10,904గా ఉన్నాయి. (ఆదివారం నాటి హెల్త్ బులెటిన్ ప్రకారం)
Also Read: undefined
Must Read: కరోనా రోగి మరో వీడియో వైరల్.. ఏకంగా మంత్రి ఈటలకు ఫోన్ చేసి..