యాప్నగరం

ప్రాణదాతలకు రాఖీలు కట్టిన గవర్నర్.. రాజ్‌భవన్‌లో వినూత్నంగా రక్షాబంధన్

తెలంగాణ గవర్నర్ తమిళిసై రక్షా బంధన్ వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసిన వారిని ఆమె సత్కరించారు.

Samayam Telugu 4 Aug 2020, 7:46 am
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాఖీ వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో.. రక్షా బంధన్ సందర్భంగా ప్లాస్మా డోనర్లను గవర్నర్ సన్మానించారు. కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసిన వారికి రాఖీలు, స్వీట్లు పంచి శాలువాతో సత్కరించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో 13 మంది ప్లాస్మా దాతలను ఆమె సన్మానించారు.
Samayam Telugu ప్లాస్మా డోనర్లతో తమిళిసై
tamilisai raksha bandhan celebrations


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్లాస్మా డోనర్లపై ప్రశంసలు గుప్పించారు. కరోనా వేళ ప్రభుత్వ ఆసుపత్రులు అమోఘమైన సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా డోనేట్ చేసిన వీరికి ప్రభుత్వ హాస్పిటళ్లలో విజయవంతంగా చికిత్స అందించిన వైద్య సిబ్బందిని గవర్నర్ అభినందించారు.

కరోనా రోగుల ప్రాణాలను కాపాడటానికి ప్లాస్మా బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలని తమిళిసై పిలుపునిచ్చారు. కరోనా అంటే భయపడాల్సిన పని లేదని.. లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని ఆమె సూచించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్ చేసి కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.