యాప్నగరం

కచ్చితంగా 4T సూత్రం పాటించండి.. గవర్నర్ తమిళిసై సూచన

Raj Bhavan: ఆదివారం చేయించుకున్న కరోనా పరీక్షలో తనకు నెగటివ్ వచ్చిందని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. ప్రజలంతా తప్పనిసరిగా 4T అనే సూత్రాన్ని పాటించాలని సూచించారు.

Samayam Telugu 14 Jul 2020, 11:48 pm
తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక సూచనలు చేశారు. శనివారం గవర్నర్ కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆదివారం వచ్చిన రిపోర్టులో కరోనా నెగటివ్‌గా అని తేలింది. కానీ, కొంత మంది రాజ్ భవన్ సిబ్బందికి పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని గవర్నర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు.
Samayam Telugu తమిళిసై
tamilisai soundararajan


‘‘ఈ రోజు నేను కరోనా టెస్టు చేయించుకున్నా. నెగటివ్‌గా వచ్చింది. రెడ్ జోన్‌లో ఉన్నవారు, కరోనా బాధితులను కలిసిన వారు దయచేసి వీలైనంత తొందరగా కరోనా పరీక్షలు చేయించుకోండి. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాక, ఎదుటివారిని కూడా కాపాడిన వాళ్లమవుతాం. ఇందుకోసం ఏమాత్రం వెనకడుగు వేయకండి. మీరు పరీక్షలు చేయించుకొని ఎదుటివారిని అందుకు ప్రోత్సహించండి. ముఖ్యంగా ‘4టీ’ అనే సూత్రాన్ని పాటించండి.’’ అని సూచించారు.

Must Read: కరోనా శవానికి అంత్యక్రియలు.. హైదరాబాద్‌లో కాలనీ మొత్తం ఖాళీ!

4టీ అంటే.. టెస్ట్, ట్రేస్‌ (వైరస్ సోకిన వారిని గుర్తించడం), ట్రీట్‌ (చికిత్స), టీచ్ (ఎదుటివాళ్లను ప్రోత్సహించడం) అని గవర్నర్‌ తమిళిసై ట్వీటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్‌ సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిమ్స్ సహా కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులను, వైద్యులను కలిశారు. ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.

Must Read: నిజాం రహస్య నిధుల కోసమే సచివాలయం కూల్చివేత.. రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: ఎంపీ అర్వింద్‌పై గుడ్లతో దాడి! ఇది కేసీఆర్‌కు సిగ్గుచేటు: అర్వింద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.