యాప్నగరం

సూర్యాపేట ఘటనపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి.. అధికారులకు ఆదేశాలు

సూర్యాపేట స్టేడియంలో గ్యాలరీ కుప్పకూలిన ఘటనపై గవర్నర్ స్పందించారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Samayam Telugu 22 Mar 2021, 10:24 pm
సూర్యాపేట స్టేడియంలో 47వ జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవంలో గ్యాలరీ కుప్పకూలిన ఘటనపై గవర్నర్ తమిళిస సౌందర్‌రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలుసుకున్న గవర్నర్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రమాద వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. పెద్దసంఖ్యలు క్షతగాత్రులు ఉండడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
governor


అట్టహాసంగా ఏర్పాటు చేసిన జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగింది. ప్రేక్షకుల కోసం స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో చాలా మందికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సుమారు 1500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే పెద్దాస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.