యాప్నగరం

తమిళనాడు, తెలంగాణకు వారధిలా ఉంటా: గవర్నర్ తమిళిసై

Governor Tamilisai Soundararajan చెన్నైలోని తన నివాసంలో పొంగల్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. సంప్రదాయ మట్టికుండలో పొంగల్ వండి సూర్య భగవానుడికి సమర్పించారు.

Samayam Telugu 14 Jan 2020, 6:38 pm
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పొంగల్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. చెన్నైలోని తన నివాసంతో మంగళవారం (జనవరి 14) ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమిళనాడు, తెలంగాణకు మధ్య తాను వారధిలా ఉంటానని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమిళనాడులోని ప్రాచీన ఆలయాలను సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తారని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య జల బంధం తదితర అంశాలపై తనకు అనేక ఆలోచనలు ఉన్నాయని తెలిపారు.
Samayam Telugu tamilsai


తెలంగాణ వాసులు తమిళనాడు ఆలయాలను సందర్శించి దేవుళ్లను ప్రార్థించి.. ఇక్కడి ప్రాచీన శిల్పకళా సౌందర్యాన్ని ఆస్వాదించాలని ఆహ్వానిస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. పర్యాటక, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహకానికి ఇరు రాష్ర్టాల మధ్య వారధిలా తాను ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

భర్త సౌందరరాజన్, కుటుంబసభ్యులతో కలిసి చెన్నైలోని శాలిగ్రామంలో తమిళిసై పొంగల్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సంప్రదాయ మట్టికుండలో పొంగల్ వండి సూర్య భగవానుడికి నివేదించారు. అనంతరం ఇరుగుపొరుగు వారితో కలిసి సరదాగా గడిపారు. పొంగల్ శుభాకాంక్షలు తెలపడానికి తమిళిసై నివాసానికి సందర్శకులు పోటెత్తారు.

Also Read: కేసీఆర్ కూడా సోషల్ మీడియాలోకి.. టీవీ వార్తలు నమ్మే పరిస్థితి లేదు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.