యాప్నగరం

RTC సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా.. అధికారులకు ఆదేశాలు

RTC Strike: ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆమె దృష్టి సారించారు.

Samayam Telugu 17 Oct 2019, 10:02 pm
ర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. కార్మికుల సమ్మె కారణంగా ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్జీసీ సమ్మె తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దృష్టి సారించిన గవర్నర్‌ తమిళిసై.. గురువారం (అక్టోబర్ 17) మధ్యాహ్నం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగారు. గవర్నర్‌కు బదులిచ్చిన మంత్రి అజయ్ కుమార్.. ఆమె వద్దకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మను పంపించారు.
Samayam Telugu Tamilisai


రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసైతో సమావేశమైన సునీల్ శర్మ.. రాష్ట్రంలో సమ్మె పరిస్థితులు, ప్రభుత్వం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఆమెకు వివరించారు. సమ్మెపై తనకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని.. ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సునీల్‌ శర్మను గవర్నర్‌ ఆదేశించారు.

Also Read: దడ పుట్టిస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు.. ప్రయాణికుల్లో ఆందోళన

మరోవైపు రెండు రోజుల పాటు తమిళనాడు పర్యటన నిమిత్తం గవర్నర్ తమిళిసై గురువారం రాత్రి చెన్నై బయల్దేరి వెళ్లారు. శనివారం ఆమె కోయంబత్తూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ తిరిగి రానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.