యాప్నగరం

Republic Day: జెండా ఆవిష్కరించిన గవర్నర్.. హైదరాబాద్ మెడికల్ హబ్, తెలంగాణ రైస్ బౌల్‌గా మారిందన్న తమిళి సై

Republic Day Celebrations: తెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె ప్రసంగించారు.

Samayam Telugu 26 Jan 2022, 8:18 am
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
Samayam Telugu గణతంత్ర వేడుకల్లో తమిళి సై


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది. రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పిస్తున్నా. వ్యాక్సినేష‌న్‌లో ప్రపంచంలోనే మ‌నం ముందున్నందుకు గ‌ర్వంగా ఉంది. త్వర‌లోనే 200 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకోనున్నాం. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఎదగడం సంతోషకరం. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృత‌జ్ఞతలు.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..’ అని ఆమె పేర్కొన్నారు.

అంతకుముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని వార్ మెమోరియల్ (వీరుల సైనిక్ స్మారక్) వద్దకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. కాగా, ప్రతి ఏడాది పబ్లిక్ గార్డెన్స్లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఏడాది ఆ వేదికను రాజ్భవన్కు మార్చారు. కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.