యాప్నగరం

ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ

Telangana గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Samayam Telugu 15 Oct 2019, 10:16 pm
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళిసై మంగళవారం (అక్టోబర్ 15) రాత్రి ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం. అనంతరం హోం మంత్రి అమిత్ షాతోనూ తమిళిసై భేటీ కానున్నారు.
Samayam Telugu Tamilsai


తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.