యాప్నగరం

రిమ్స్‌లో ఆదివాసీ గర్భిణి మృతి.. గవర్నర్ సీరియస్, విచారణకు ఆదేశం

ప్రసవం కోసం రిమ్స్‌లో చేరిన ఆదివాసీ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Samayam Telugu 22 Jun 2020, 2:16 pm
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆదివాసీ గర్భిణి మృతిపై గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ మృతిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆమె ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో గర్భిణి మృతిపై జిల్లా వైద్యాధికారి విచారణ జరుపుతున్నారు. గర్భిణి అయిన జయశీల ప్రసవం కోసం రిమ్స్‌లో చేరగా.. జూన్ 19న చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెతో పాటు కడుపులో ఉన్న కవలలు కూడా మృతి చెందారు.
Samayam Telugu తమిళిసై
tamilisai soundararajan


వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని గర్భిణి చనిపోయిందని ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. దీనికి కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆమె విచారణకు ఆదేశించారు.

గతంలో గద్వాలకు చెందిన ఓ గర్భిణి కూడా ప్రసవం కోసం ఆరు హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోగా.. ఆ చిన్నారి కూడా చనిపోయాడు. ఈ ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.