యాప్నగరం

కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సైంటిస్టులకు సెల్యూట్: గవర్నర్ తమిళిసై

Shamirpet: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరిని నిర్మూలించడానికి వ్యాక్సిన్ తయారుచేస్తున్న భారత్ బయోటెక్ శాస్త్రవేతలతో పాటు వ్యాక్సిన్ తయారీకి శ్రమిస్తున్న ప్రతిఒక్కరిని అభినందిస్తున్నట్లు తమిళి పేర్కొన్నారు.

Samayam Telugu 29 Sep 2020, 5:36 pm
భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో శ్రమిస్తున్న ప్రతి శాస్త్రవేత్తకు సెల్యూట్ చేస్తున్నాని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. మంగళవారం ఆమె మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ మండల పరిధిలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరిని నిర్మూలించడానికి వ్యాక్సిన్ తయారుచేస్తున్న భారత్ బయోటెక్ శాస్త్రవేతలతో పాటు వ్యాక్సిన్ తయారీకి శ్రమిస్తున్న ప్రతిఒక్కరిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Samayam Telugu మాట్లాడుతున్న గవర్నర్
Tamilisai Soundararajan visits bharat biotech


తన పర్యటన ముఖ్య ఉద్దేశం కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని మరింత ఏకాగ్రతతో ముందుకుసాగేలా ప్రేరేపించడమేనని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు దేశంలో కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవర్నర్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ త్వరలో అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అనంతరం గవర్నర్ వ్యాక్సిన్‌ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వ్యాక్సిన్‌‌పై శాస్త్రవేత్తలు ఎంతో శ్రద్ధ పెట్టి పని చేస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు దేశంలో కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవర్నర్‌ పేర్కొన్నారు. 2020 లోనే కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.