యాప్నగరం

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గవర్నర్ తమిళిసై ‘వార్నింగ్’ ట్వీట్

తెలంగాణలో ఒక్క రోజులోనే 199 కరోనా వైరస్ కేసులు నమోదు కావడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేసులు పెరగడం పట్ల భయపడాల్సిన పని లేదని... కానీ ఇదో హెచ్చరిక అని ఆమె తెలిపారు.

Samayam Telugu 1 Jun 2020, 1:51 pm
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఒకే రోజులో 199 కేసులు నమోదయ్యాయన్న ఆమె.. వీరిలో ఇద్దరు మెడికోలు కూడా ఉన్నారని తెలిపారు. కరోనాను తరిమేయడానికి అందరం కలిసి పోరాటం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు.
Samayam Telugu తమిళిసై


ఒకే రోజులో కేసులు భారీగా నమోదు కావడం పట్ల భయాందోళనలు అవసరం లేదన్న గవర్నర్.. కాకపోతే ఇది హెచ్చరికే అన్నారు. మనమంతా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించారంటే దాని అర్థం జాగ్రత్త చర్యల విషయంలో సడలింపు ఇచ్చినట్లు కాదని గవర్నర్ తెలిపారు. మనం అన్‌లాక్ 1 దిశగా వెళ్తున్నాం.. లాక్‌డౌన్ 5 రిలాక్సేషన్ వైరస్‌కు కాదు విలువలకు అని సౌందర రాజన్ స్పష్టం చేశారు.

తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2689కి చేరింది. వీటిలో 2264 కేసులు స్థానికంగా నమోదైనవి కాగా.. విదేశాలు, వలస కార్మికుల వల్ల మిగతా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి 82 మంది ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.