యాప్నగరం

కొత్త సచివాలయం నిర్మాణ పనులు ఈ దిగ్గజ సంస్థకే.. ప్రభుత్వం ప్రకటన

TS New Secretariat: సుమారు ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు విధించింది.

Samayam Telugu 29 Oct 2020, 6:15 pm
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన షాపూర్‌జీ పల్లోంజీ దక్కించుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఈ-బిడ్డింగ్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. దీనికి ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. రూ.494 కోట్లకు టెండర్లను ఆహ్వానించగా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నాలుగు శాతం ఎక్కువగా కోట్‌ చేసింది.
Samayam Telugu తెలంగాణ కొత్త సచివాలయం (నమూనా చిత్రం)
Telangana Secretariate new


మరో సంస్థ ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ పనులు దక్కించుకునేందుకు 4.8 శాతం ఎక్కువగా కోట్‌ చేసింది. బుధవారం సమావేశమైన కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ) టెండర్‌ పత్రాలను అధ్యయనం చేయగా షాపూర్‌జీ పల్లోంజీ ఎల్‌-1గా నిలిచింది. దీంతో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు తాజాగా ఆర్‌ అండ్‌ బీ అధికారులు సచివాలయం నిర్మాణానికి సంబంధించిన అంగీకార పత్రం అందించారు. సుమారు ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు విధించింది.

భవన నిర్మాణం కాక మిగిలిన ప్రదేశంలో ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఆరో అంతస్తులో ఉండనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.