యాప్నగరం

కరోనాతో ప్రభుత్వ ఉద్యోగి మృతి.. జేసీబీతో శ్మశానానికి మృతదేహం

Mulugu: వాజేడు మండలం గుమ్మిడిదొడ్డికి చెందిన ప్రసాద్ అనే ప్రభుత్వోద్యోగికి కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా ఇతను కరోనా చికిత్స పొందాడు. అయినా ఫలితం లేకపోవడంతో అది తీవ్రమైన శ్వాస సమస్యతో చనిపోయాడు.

Samayam Telugu 7 Aug 2020, 11:12 pm
కరోనా సోకిన వారిపట్ల వైద్య సిబ్బందిలో కొందరు అమానుషంగా వ్యవహరిస్తున్న తీరు కలవరపరుస్తోంది. భరోసా కల్పించాల్సిన సిబ్బంది తీరుతో బాధితుల్లో మానసిక స్థైర్యం లోపిస్తుంది. అయితే, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సైతం సిబ్బంది అత్యంత దారుణంగా శ్మశానానికి తరలించిన ఘటన విస్మయం కలిగిస్తోంది. ఆ చనిపోయిన వ్యక్తి ఓ ప్రభుత్వ అదికారి కావడం గమనార్హం.
Samayam Telugu జేసీబీతో శ్మశానానికి తరలిస్తున్న మృతదేహం
govt officer's body who dies with corona moves with JCB in mulugu district


ప్లాస్టిక్ బ్యాగుల్లో గాలి కూడా చొరబడకుండా ప్యాక్ చేసిన కరోనా మృతదేహాలను పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది తాకేందుకు సైతం ముందుకురావడం లేదు. ఈ క్రమంలోనే వాటిని జేసీబీలతో తరలిస్తున్నారు. అదే వాహనంతో గొయ్యిలో పూడ్చిపెడుతున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనే ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వాజేడు మండలం గుమ్మిడిదొడ్డికి చెందిన ప్రసాద్ అనే ప్రభుత్వోద్యోగికి కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా ఇతను కరోనా చికిత్స పొందాడు. అయినా ఫలితం లేకపోవడంతో అది తీవ్రమైన శ్వాస సమస్యతో చనిపోయాడు.

అనంతరం కరోనా వల్ల చనిపోయిన అతడి మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబసభ్యులు సైతం వెనుకాడారు. దీంతో పంచాయితీ సిబ్బంది ఆ పని చేయాల్సి వచ్చింది. అయితే వారుకూడా మృతదేహాన్ని తాకకుండా జేసీబీతో శ్మశానానికి తరలించారు. ఇలా కరోనా మృతదేహాలను ఖననం చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలోనూ గతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్పందించి సంబంధిత వ్యక్తులను సస్పెండ్ చేయించారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్‌ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.