యాప్నగరం

ఫ్రిడ్జ్‌లో బూజుపట్టిన మేక మాంసం.. హైదరాబాద్‌లో మటన్ షాపుల దారుణాలు

Panjagutta: మటన్ షాప్ నిర్వహకులు మటన్‌ని ఫ్రిడ్జ్‌లో ఉంచి నిల్వ ఉంచుతున్నారు. అలా ఉంచిన మాంసాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ధరకు కూడా అమ్ముతూ ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు దాడులు చేసి ఆ మటన్ షాప్‌లో సోదాలు చేశారు.

Samayam Telugu 17 May 2020, 7:33 am
లాక్ డౌన్ అమలవుతున్న వేళ మాంసం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మటన్ షాప్‌లో కల్తీ మాంసం అమ్మినా లేక ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని గతంలోనే ప్రభుత్వం హెచ్చరించింది. గతంలోనూ సోదాలు జరిపి హైదరాబాదులో చాలా వరకు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. నిర్వహకులపై కఠిన చర్యలూ తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులో ఉన్న ఏ-వన్ అనే మటన్ షాప్‌ను నిబంధనలు పాటించనందున శనివారం అధికారులు దాడి చేసి సీజ్ చేశారు.
Samayam Telugu మటన్ దుకాణంలో అధికారుల పరిశీలన


హైదరాబాద్ పంజాగుట్టలోని మటన్ షాప్ నిర్వహకులు మటన్‌ని ఫ్రిడ్జ్‌లో ఉంచి నిల్వ ఉంచుతున్నారు. అలా ఉంచిన మాంసాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ధరకు కూడా అమ్ముతూ ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు దాడులు చేసి ఆ మటన్ షాప్‌లో సోదాలు చేశారు. రెండు మూడు రోజులపాటు మటన్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టి వినియోగదారులకు అమ్ముతున్నట్టు గుర్తించారు. నిబంధనలు పాటించనందున దుకాణాన్ని సీజ్ చేశారు. పశుసంవర్థక శాఖ, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి ఈ తనిఖీలు చేస్తున్నారు.

ధరల విషయంలోనూ కిలో మటన్‌ రూ.700కు మించి విక్రయించకూడదంటే చాలా చోట్ల రూ.900 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు. చికెన్‌ రూ.257లకు అమ్మాలని నిర్ణయిస్తే రూ.270, రూ.290కు అమ్ముతున్నారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.