యాప్నగరం

విద్యార్థినిలతో టీచర్ అసభ్య ప్రవర్తన

Hyderabad: ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10 విద్యార్థినిలతో ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 13 Dec 2019, 6:40 pm
హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. 8, 9, 10వ తరగతికి చెందిన విద్యార్థినిలను వేధిస్తున్నాడు. బాధిత బాలికలు శుక్రవారం (డిసెంబర్ 13 నేరెడ్‌మెట్ పోలీస్‌ స్టేషన్‌లో సదరు కీచక ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సాంఘీక శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు జగదీశ్వర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu jagadishwar


బాలికలు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు పరారయ్యాడు. బాధిత బాలికల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Don't Miss: సీఎం జగన్‌కు ధన్యవాదాలు: దిశ తండ్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.