యాప్నగరం

సికింద్రాబాద్: కార్పొరేట్ ఆస్పత్రి ముందు బీజేవైఎం నేతల నిరసన

Telangana BJP: కరోనా వైద్యాన్ని వెంటనే ఆరోగ్య శ్రీలో చేర్చాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుస్మాన్ పథకాన్ని తెలంగాణలోనూ అనుమతించాలని నినాదాలు చేశారు.

Samayam Telugu 9 Aug 2020, 11:47 am
కరోనా వైరస్ విషయంలో కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వారు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసనలు చేపట్టారు. ఆస్పత్రి ఎదుట బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కరోనా వైద్యం పేరుతో రూ.లక్షలు చొప్పున బిల్లు వేస్తున్న ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu బీజేవైఎం నేతల నిరసన
govt should take action against private hospitals, protests BJYM Leaders


అంతేకాక, కరోనా వైద్యాన్ని వెంటనే ఆరోగ్య శ్రీలో చేర్చాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుస్మాన్ పథకాన్ని తెలంగాణలోనూ అనుమతించాలని నినాదాలు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీలను అరికట్టి కరోనా వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని పేద ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.