యాప్నగరం

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

DCM Accident: శంషాబాద్ సమీపంలోని తుక్కుగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్బుల్ లోడ్‌తో వస్తున్న డీసీఎం బ్రేకులు ఫెయిలవడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. మార్బుల్స్ మధ్య నలిగి కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 22 Nov 2019, 9:11 pm
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శంషాబాద్ నుంచి గ్రానైట్ మార్బుల్ లోడ్‌తో వస్తున్న డీసీఎం డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న మార్బుల్స్ అందులో ఉన్న కార్మికులపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. మార్బుల్స్ మధ్య ఇరుక్కుపోయి ఓ కార్మికుడు దుర్మరణం పాలవగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Samayam Telugu తుక్కుగూడ ప్రమాదం


డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టోల్ గేట్ సమీపంలో డివైడర్‌ను బలంగా ఢీకొని డీసీఎం కుదుపులకు లోనైంది. మార్బుల్స్ మధ్యలో ఇరుక్కు పోయిన కార్మికులను స్థానికులు బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

Also Read: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.