యాప్నగరం

గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha: గుజరాత్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. గర్భిణీని రేప్ చేసి, ఆమె మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన రేపిస్టులను విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం సున్నితత్వం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇది చట్ట విరుద్ధమే కాకుండా.. మానవత్వానికి కూడా వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 18 Aug 2022, 7:01 pm

ప్రధానాంశాలు:

  • బీజేపీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
  • గుజరాత్ సర్కార్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కవిత ఆరోపణలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu MLC Kavitha
కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha: బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులను విడుదల చేసిన వ్యవహారంలో.. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషులను విడుదల చేస్తూ.. గుజరాత్ ప్రభుత్వం (Gujarat govt) జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపిస్టులకు స్వాగతం చెప్పడం సమాజానికి చేటు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరంపర మొదలు కాకముందే.. ఈ సాంప్రదాయాన్ని ఆపాల్సిన అవసరం ఉందని కవిత వ్యాఖ్యానించారు.
రేపిస్టులు, హత్య చేసిన వాళ్లు జైలు నుంచి విడుదల అయిన తర్వాత.. ఒక సిద్దాంతాన్ని పాటించే వాళ్లు కొంతమంది స్వాగతం చెప్పడం సమాజానికి ప్రమాదకరమని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 15న బిల్కిస్ బానో (Bilkis Bano) అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేస్తూ.. గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలకు.. కొందరు మిఠాయిలు తినిపిస్తూ.. పూలదండలతో స్వాగతం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత దీనిపై ఘాటుగా స్పందించారు.

ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి కవిత చేశారు. పౌరులకు చట్టంపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండడానికి.. నిర్భయ వంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చేయడానికి.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.