యాప్నగరం

చికాగోలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు.. చేరుకున్న పది రోజులకే..

తెలంగాణకు చెందిన విద్యార్థిపై చికాగోలో నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి చరణ్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లగా.. మరో విద్యార్థికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల విషయాన్ని సాయి చరణ్ స్నేహితులు.. అతని కుటుంబానికి చేరవేశారు. దీంతో.. సాయి చరణ్ కుటుంబ సభ్యులు తీవ్రం భయాందోళకు గురవుతున్నారు. అయితే.. కాల్పులు ఎందుకు జరిపారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 23 Jan 2023, 6:51 pm

ప్రధానాంశాలు:

  • చికాగోలో తెలంగాణ విద్యార్థిపై నల్లజాతీయుల కాల్పులు
  • కాల్పుల్లో విద్యార్థి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు
  • ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gun firing at telangana student
కాల్పులు
చికాగోలో తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సదరు విద్యార్థితో పాటు మరో విద్యా్ర్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్ ఎల్ఐసీ కాలనీకి చెందిన కొప్పాల సాయి చరణ్ అనే విద్యార్థి.. పై చదువుల కోసం జనవరి 11వ తేదీన చికాగోకు వెళ్లాడు. చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఒక్కసారిగా సాయి చరణ్‌పై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాయి చరణ్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. సాయి చరణ్‌తో పాటు మరో విద్యార్థికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే.. సాయిచరణ్ మీద నల్ల జాతీయులు కాల్పులు ఎందుకు జరిపారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
కాల్పులు జరిపిన వెంటనే సాయి చరణ్‌ను తోటి విద్యార్థులు, కాలేజీ యజమాన్యం చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. సాయి చరణ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి చరణ్.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. సాయి చరణ్‌కు జరిగిన ఘటన గురించి చికాగో నుంచి అతని స్నేహితులు, తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్ర తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. అక్కడ సాయి చరణ్ పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళనకు గురవుతున్నారు.

కాల్పులకు గురైన సాయిచరణ్



ఏజెన్సీలో 'శంకర్‌దాదా ఎంబీబీఎస్'.. ఫేస్ చూసి డిసీస్ చెప్పేస్తాడు.. 'భూత వైద్యం'లో స్పెషలిస్ట్..
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.