యాప్నగరం

నార్సింగిలో కాల్పుల కలకలం.. మాజీ ఆర్మీ జవాన్ అరెస్ట్

గాల్లోకి రెండు రౌడ్ల కాల్పులు జరిపారు. ఇందులో ఓ బుల్టెట్ ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 28 Aug 2020, 11:01 am
హైదరాబాద్ నార్సింగి హైదర్ష్ కోట లో కాల్పుల కలకలం రేగింది. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో మాజీ ఆర్మీ అధికారి ఒకరు కాల్పులకు పాల్పడ్డారు. మాజీ ఆర్మి ఉద్యోగి నాగ మల్లేష్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో నాగ మల్లేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని వద్ద ఉన్న రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రెండు రౌండ్ల కాల్పులు జరిపాకు. ఒకటి గాల్లోకి .. మరోకటి మరో వ్యక్తిపైకి కాల్పులు జరిపారు.
Samayam Telugu నార్సింగిలో కాల్పుల కలకలం
gun firing


గురువారం రాత్రి అపార్ట్‌మెంట్‌పై పార్టీ చేసుకున్న హైరిచ్‌ ఇంటర్నెట్‌ సిబ్బందిపై విశ్రాంత ఆర్మీ జవాన్‌ నాగమల్లేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పార్టీ చేసుకోవద్దని వారించాడు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన మాజీ జవాన్‌ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఓ వ్యక్తి లక్ష్యంగా కాల్పులు జరపగా..అతని చేయి పక్క నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లింది.
Read More: లిఫ్ట్ బటన్‌తో 20మందికి కరోనా.. ఖమ్మంలో కలకలం
నర్సింగ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధి లోని హైదర్ షాకోట్ మెయిన్ రోడ్డు పై ఉన్న శివం హైలెట్స్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్ వద్ద ఇంటి పైన హై రీచ్ ఇంటర్నెట్ సిబ్బంది మందు పార్టీ చేసుకుంటు న్నారు. పలుమార్లు చెప్పినా కూడా ఇంటర్నెట్ సిబ్బంది పట్టించుకోవడం లేదని కోపంతోనే ఎక్స్ ఆర్మి ఉద్యోగి నాగ మల్లేష్ గాల్లో కాల్పులు జరిపారని పోలీసుల విచారణలో తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.