యాప్నగరం

నల్గొండలో మాజీ మంత్రి అరెస్టు.. తుపాకీతో అధికారులకు బెదిరింపులు

Nalgonda: పనులు నిలిపేయాలంటూ తుపాకీతో వారిని బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 30 Aug 2020, 10:23 pm
నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి ఒకరు హల్ చల్ చేశారు. మాజీ మంత్రి ఆయన గుత్తా మోహన్‌ రెడ్డి ఏకంగా తుపాకీ పట్టుకొచ్చి బీభత్సం చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో పిల్లాయిపల్లి జరుగుతున్న కాలువ పనులను గుత్తా మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. సర్వే ప్రకారమే పనులు నిర్వహిస్తుండగా తన భూమి నుంచి కాలువ వెళ్లొద్దంటూ ఇంజినీర్‌, జేసీబీ ఆపరేటర్‌తో వాగ్వాదానికి దిగారు. పనులు నిలిపేయాలంటూ తుపాకీతో వారిని బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. పనులకు ఆటంకం కలిగించినందుకుగానూ త్వరలో గుత్తా మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తారని తెలుస్తోంది.
Samayam Telugu తుపాకీతో హల్‌చల్ చేస్తున్న మాజీ మంత్రి
gun


Must Read: undefined

Must Read: 139 మంది రేప్ కేసులో ట్విస్ట్.. డాలర్ బాయ్‌ ఆఫీస్ సీజ్.. లోపల సంచలన విషయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.