యాప్నగరం

ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్.. గెలుపు లాంఛనమే!

Gutta sukhendar Reddy | టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన యాదవరెడ్డిపై స్పీకర్ గతంలో అనర్హత వేటు వేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఎన్నిక నిర్వహించనున్నారు.

Samayam Telugu 7 Aug 2019, 3:55 pm
తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం (ఆగస్టు 7) నామినేషన్ దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మేల్యేల సమక్షంలో నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులకు అందజేశారు. ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఈ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఇటీవల కేసీఆర్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
Samayam Telugu Gutta


సార్వత్రిక ఎన్నికల ముందు ఎమ్మెల్సీగా ఉన్న యాదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో శాసన మండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. వేటు చట్ట విరుద్ధమంటూ యాదవరెడ్డి హైకోర్టు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు చైర్మన్ నిర్ణయాన్నే సమర్థించడంతో ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడి, ఎన్నిక అనివార్యమైంది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాఛనమే కానుంది.

ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈ నెల 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న పరిశీలన చేపట్టి, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆగస్టు 26 ఎన్నిక నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చెపడతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.