యాప్నగరం

తెలంగాణలో ఏప్రిల్ 7 నుంచి ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

Telangana: పాఠశాలల్లో ఏప్రిల్ 7 నుంచి ఒంటిపూట బడులు అమల్లో ఉంటాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పాఠశాలలకు టీచర్లు హాజరు కావాల్సి ఉంటుంది.

Samayam Telugu 6 Apr 2021, 10:38 pm
తెలంగాణలో ఏప్రిల్ 7 నుంచి ఉపాధ్యాయులకు ఒంటి పూట విధులు మొదలు కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉపాధ్యాయులు విధుల్లో ఉండాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విద్యా సంస్థలు మూసివేసినప్పటికీ.. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి ఆన్‌లైన్ పాఠాలు పర్యవేక్షించాలని సూచించారు. తెలంగాణ పాఠశాల విద్య, హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్లు రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు ఈ మేరకు మంత్రి ఆదేశాలిచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
inter exams


మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుమార్‌ ఏప్రిల్‌ 1న ఆదేశాలిచ్చారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.