హైదరాబాద్లో గురువారం (సెప్టెంబర్ 5) భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్పల్లి నుంచి ఖైరతాబాద్ వరకు గంటల తరబడి అంగుళం ముందుకు కదలని పరిస్థితి తలెత్తింది. ఖైరతాబాద్ నుంచి అటు కోటి, గౌలిగూడ మార్గంలోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు అమీర్పేట నుంచి గౌలిగూడ వరకు గురునానక్ రథయాత్ర జరిగింది. ఈ రథయాత్ర కారణంగా ట్రాఫిక్కు మరింత ఇబ్బంది తలెత్తింది. ఇదే సమయంలో రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ వేడుకల కారణంగా అసెంబ్లీ సమీపంలో ట్రాఫిక్కు ఇబ్బంది తలెత్తింది.
Also Read: జగన్ సర్కార్ ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఎస్ఆర్ నగర్ నుంచి పంజాగుట్ట మీదుగా వాహనాలను మళ్లించారు. సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.
Don't Miss: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. ఊహించని ట్విస్ట్
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు అమీర్పేట నుంచి గౌలిగూడ వరకు గురునానక్ రథయాత్ర జరిగింది. ఈ రథయాత్ర కారణంగా ట్రాఫిక్కు మరింత ఇబ్బంది తలెత్తింది. ఇదే సమయంలో రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ వేడుకల కారణంగా అసెంబ్లీ సమీపంలో ట్రాఫిక్కు ఇబ్బంది తలెత్తింది.
Also Read: జగన్ సర్కార్ ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఎస్ఆర్ నగర్ నుంచి పంజాగుట్ట మీదుగా వాహనాలను మళ్లించారు. సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.
Don't Miss: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. ఊహించని ట్విస్ట్