యాప్నగరం

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. నగరవాసికి నరకం, కారణాలివే

Hyderabad నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు భక్తుల రద్దీ పెరగడం, అదే సమయంలో పలు కార్యక్రమాలు ఉండటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి నగర వాసికి నరకం కనబడింది.

Samayam Telugu 5 Sep 2019, 4:45 pm
హైదరాబాద్‌లో గురువారం (సెప్టెంబర్ 5) భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్‌పల్లి నుంచి ఖైరతాబాద్ వరకు గంటల తరబడి అంగుళం ముందుకు కదలని పరిస్థితి తలెత్తింది. ఖైరతాబాద్ నుంచి అటు కోటి, గౌలిగూడ మార్గంలోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Samayam Telugu Representational Image


ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు అమీర్‌పేట నుంచి గౌలిగూడ వరకు గురునానక్‌ రథయాత్ర జరిగింది. ఈ రథయాత్ర కారణంగా ట్రాఫిక్‌కు మరింత ఇబ్బంది తలెత్తింది. ఇదే సమయంలో రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ వేడుకల కారణంగా అసెంబ్లీ సమీపంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది తలెత్తింది.

Also Read: జగన్ సర్కార్ ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఎస్‌ఆర్‌ నగర్‌ నుంచి పంజాగుట్ట మీదుగా వాహనాలను మళ్లించారు. సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.

Don't Miss: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. ఊహించని ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.