యాప్నగరం

కేంద్రం సూచనలతో భాగ్యనగరంలో హైఅలర్ట్.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు

జమ్మూ కశ్మీర్ పరిణామాలతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో వెంటనే స్పందించిన తెలంగాణ డీజీపీ పోలీసు విభాగాన్ని అలెర్ట్ చేశారు.

Samayam Telugu 5 Aug 2019, 8:22 pm
ఆర్టికల్ 370 రద్దుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని రాష్ట్రాలకు హై అలర్ట్ జారీ చేసింది. సున్నిత ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. దీంతో తెలంగాణలోనూ హై అలర్ట్ ప్రకటించారు. సున్నిత ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు తెలంగాణ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ను పెంచారు.
Samayam Telugu hyd police2.


పాత బస్తీలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసుల బలగాలను భారీగా మోహరించారు. సంఘ విద్రోహక శక్తు కదలికలపై నిఘా పెట్టడం కోసం పికెట్స్‌ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

కశ్మీర్‌‌ను రెండుగా విభజించడం పట్ల టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత స్పందించారు. కశ్మీర్ ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాక్షించారు. కశ్మీరాన శాంతిసామరస్యాలు వర్థిల్లాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతించారు.

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఎంఐఎం మాత్రమే వ్యతిరేకించగా.. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ సమర్థించాయి. అమిత్ షా ధైర్యంగా ముందడుగేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొనియాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు.

Read Also: కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుంది.. పవన్ ప్రశంసలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.