యాప్నగరం

7 కరోనా పాజిటివ్‌లతో కరీంనగర్‌లో హైఅలర్ట్.. రంగంలోకి 100 ప్రత్యేక బృందాలు

Coronavirus in Telangana: ఈ నెల 16న కరోనా పరీక్షల నిమిత్తం 12 మందిని వైద్య పరీక్షలకు హైదరాబాద్‌ తరలించగా.. మార్చి 18న మరో 9 మందిని తీసుకొచ్చారు. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా అధికారులు ఇండోనేసియా బృందంతో సన్నిహితంగా ఉన్నవారి కోసం గాలింపు మొదలుపెట్టారు.

Samayam Telugu 19 Mar 2020, 12:10 pm
ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన విదేశీ వ్యక్తుల్లో మొత్తం 8 మందిలో కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది. కరీంనగర్‌ కేంద్రంతోపాటు ఈ బృందం పర్యటించిన ఇతర ప్రాంతాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. వారు నగరంలో ఉన్న మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే, వీరు కలెక్టరేట్‌‌కు అతి సమీపంలోని ప్రార్థనా మందిరాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మార్చి 14, 15 తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచారించారని అధికారులు గుర్తించారు. ఇంకా వీరు తిరిగిన ప్రాంతాలను తెలుసుకొనేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 16న కరోనా పరీక్షల నిమిత్తం 12 మందిని వైద్య పరీక్షలకు హైదరాబాద్‌ తరలించగా.. మార్చి 18న మరో 9 మందిని తీసుకొచ్చారు. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా అధికారులు ఇండోనేసియా బృందంతో సన్నిహితంగా ఉన్నవారి కోసం గాలింపు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13కు చేరింది.
Samayam Telugu Karimnagar corona


100 ప్రత్యేక టీమ్‌లు
ముందస్తు చర్యల్లో భాగంగా ఇండోనేసియా బృందం కరీంనగర్‌లో సంచరించిన ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకునేలా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేశారు. గురువారం నుంచి కరీంనగర్‌‌లో 100 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. వీలునిబట్టి ఆయా ప్రాంతాల్లో కఠినతర ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక, నగర సీపీ, వైద్య ఉన్నతాధికారులతో అత్యవసర రివ్యూ నిర్వహించారు.

Also Read: రేవంత్ రెడ్డి రివర్స్ ఎటాక్.. బెయిల్‌పై విడుదల కాగానే ఆయనతోనే మొదలు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్య తీవ్రతను ప్రజలు గుర్తించాలని, ప్రతి ఒక్కరూ స్వీయజాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇండోనేసియా టీమ్ కలెక్టరేట్‌ ప్రాంతంలో రెండు రోజుల పాటు ఉండడంతో చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. కరీంనగర్‌లో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన షాపులు, ఇతర సంస్థలు మూసివేస్తేనే మంచిదని సూచించారు. అందరూ విధిగా ఇంటి వద్దే ఉండడం మంచిదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: 3 రోజుల్లో 3 దేశాలు తిప్పారు.. తిండి, నిద్ర లేదు.. తెలుగు విద్యార్థుల ఆవేదన


Also Read: కరోనా కట్టడి చర్యలు.. టీఎస్‌ఆర్టీసీ కండక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.