యాప్నగరం

కరోనా పరీక్షలు అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం.. హైకోర్టు ఆగ్రహం

Telangana High court: ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోడం ప్రజల హక్కు అని వ్యాఖ్యానించింది. ఒకవేళ అక్కడి ల్యాబ్‌లు, సాంకేతిక నిపుణుల నైపుణ్యంపై నమ్మకం లేకపోతే మరి ప్రభుత్వం పథకమైన ఆరోగ్యశ్రీ సేవలకు ఎందుకు అనుమతించారని సూటిగా ప్రశ్నించింది.

Samayam Telugu 20 May 2020, 5:40 pm
తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తు్న్న నేపథ్యంలో బుధవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కొవిడ్ పరీక్షలు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఆ పరీక్షలకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం గాంధీ, నిమ్స్‌, కింగ్ కోఠి తదితర ప్రభుత్వాసుపత్రుల్లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం ఏంటని నిలదీసింది. ఈ విధానాలు రాజ్యంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Telangana High court


ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోడం ప్రజల హక్కు అని వ్యాఖ్యానించింది. ఒకవేళ అక్కడి ల్యాబ్‌లు, సాంకేతిక నిపుణుల నైపుణ్యంపై నమ్మకం లేకపోతే మరి ప్రభుత్వం పథకమైన ఆరోగ్యశ్రీ సేవలకు ఎందుకు అనుమతించారని సూటిగా ప్రశ్నించింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు, ప్రయోగశాలలు ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులు, ల్యాబ్స్‌లో వైద్య సిబ్బంది, సదుపాయాలను పరిశీలించి ఐసీఎంఆర్ అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అలా ఐసీఎంఆర్ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.