యాప్నగరం

పది పరీక్షలు వాయిదా వేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19 (గురువారం) నుంచి పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులిచ్చినా పరీక్షలను మాత్రం అలాగే నిర్వహించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది.

Samayam Telugu 20 Mar 2020, 4:37 pm
కరోనా వైరస్‌ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ పది పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం జరగాల్సిన పరీక్ష మాత్రం యథాతథంగా నిర్వహించి, మళ్లీ సోమవారం నుంచి నెలాఖరు వరకూ (మార్చి 23 నుంచి 30 వరకు) జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఇక ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది.
Samayam Telugu exams


తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19 (గురువారం) నుంచి పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులిచ్చినా పరీక్షలను మాత్రం అలాగే నిర్వహించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

Must Read: కరోనా అంతానికి కేంద్రం కఠిన చర్యలివే.. కిషన్ రెడ్డి వెల్లడి

ఈ పిల్‌ను హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిస్తున్న తరుణంలో పరీక్షలు కొనసాగించడం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాక, విద్యార్థులు కూడా ప్రశాంతంగా చదవలేరని, ఇబ్బందికర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం తగదని వివరించారు. పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.

Must Read: షాకింగ్! తెలంగాణలో మరింత మంది ఇండోనేసియన్లు, వియత్నామీలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.